
సాక్షి డిజిటల్ న్యూస్ ,వేంపల్లె, జూలై: 20 (పులివెందుల తాలూకా రిపోర్టర్ గోసల ఆంజనేయులు) పాఠశాల గుర్తింపునకు విధ్యార్థులే కీలకమని స్థానిక నారాయణ విద్యా సంస్థల కరస్పాండెంట్ కె.నారాయణ రెడ్డి వెల్లడించారు. సోమవారం కడపలోని మాధవి కన్వెన్షన్ హాల్లో రాష్ట్ర ప్రభుత్వం ద్వారా అందిస్తున్న షైనింగ్ స్టార్స్ అవార్డులను నారాయణ విద్యా సంస్థ విధ్యార్థిని కె.కీర్తన, డి.కీర్తన లు అందుకున్నారు. ఈ అవార్డులను కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ చేతుల మీదుగా ప్రధానం చేశారు. రూ.20 వేల చెక్కుతో పాటు సర్టిఫికేట్, మెడల్స్ లను విధ్యార్థినిలకు పంపిణీ చేశారు. పదోతరగతి -2026 ఫలితాల్లో తమ పాఠశాలకు చెందిన విధ్యార్థినిలు కె.కీర్తన(587), డి.కీర్తన(579) అత్యుత్తమ ప్రతిభతో విజయాన్ని సొంతం చేసుకున్నట్లు పాఠశాల కరస్పాండెంట్ కె.నారాయణ రెడ్డి తెలిపారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న షైనింగ్ స్టార్స్ అవార్డులను తమ విధ్యార్థినిలు దక్కించుకోవడం సంతోషకరమన్నారు. ప్రతి విధ్యార్థి ఒక లక్ష్య సాధన దిశగా అడుగులు వేసి భవిష్యత్ లో ఉన్నతమైన స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కడప ఆర్జేడి శ్యాముల్, డిఇఓ షంషుద్దీన్, ఆర్ఐఓ పట్నాయక్, జిల్లా గ్రంధాలయ ఛైర్మన్ భానుప్రకాష్, వేంపల్లె ఎంఇఓ వెంకట్రామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.