
సాక్షి డిజిటల్ న్యూస్ ములకలపల్లి జూలై 04 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట నియోజకవర్గం ములకలపల్లి మండలం మూకమామిడి పోస్టాఫీస్లో పోస్ట్ ఆఫీస్ సేవలను సద్వినియోగం చేసుకోవాలి అని మూకమామిడి గ్రామ పంచాయతీ సర్పంచ్ కోర్సా ఆదిలక్ష్మి ప్రజలను కోరారు. శనివారం పోస్ట్ ఆఫీస్ సేవలు ఉపయోగం పై ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు. గ్రామ ప్రజలకు పోస్టాఫీస్ అందిస్తున్న వివిధ సేవలు,పొదుపు పథకాలపై అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో పాల్వంచ సబ్ డివిజనల్ ఇన్స్పెక్టర్ మాలోత్ వీరన్న పాల్గొని పోస్ట్ ఆఫీస్ సేవలపై అవగాహన కల్పించారు.భారత తపాలా శాఖ ప్రజలకు అనేక రకాల పొదుపు,బీమా,ఆర్థిక సేవలను అందిస్తోందని తెలిపారు.పోస్టాఫీస్ సేవింగ్స్ అకౌంట్,రికరింగ్ డిపాజిట్,టైమ్ డిపాజిట్, మంత్లీ ఇన్కమ్ స్కీమ్, సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్,పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్,సుకన్య సమృద్ధి యోజన,పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్, గ్రామీణ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ వంటి పథకాల ద్వారా ప్రజలు భద్రంగా పెట్టుబడులు పెట్టి మంచి ప్రయోజనాలు పొందవచ్చని వివరించారు.అదేవిధంగా ఆధార్ సేవలు,ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ సేవలు,నగదు లావాదేవీలు,మనీ ట్రాన్స్ఫర్,స్పీడ్ పోస్ట్,రిజిస్టర్డ్ పోస్ట్ వంటి సేవలను కూడా పోస్టాఫీస్ ద్వారా సులభంగా పొందవచ్చని తెలిపారు.గ్రామీణ ప్రజలు పోస్టాఫీస్లో అందుబాటులో ఉన్న సేవలను పూర్తి స్థాయిలో వినియోగించుకుని ఆర్థికంగా మరింత బలోపేతం కావాలని ఆయన పిలుపునిచ్చారు.ఈ అవగాహన కార్యక్రమంలో ఎం దుర్గాప్రసాద్ వార్డు సభ్యులు భూక్య అశోక్,గ్రామ పెద్దలు ,శాస్త్ర బోయిన వెంకటేశ్వర్లు ,సున్నం వీరస్వామి,పైదా కోటేష్,మాలోత్ రవీందర్ పోస్టాఫీస్ సిబ్బంది ఎస్ ప్రవీణ్,ఎల్ లక్ష్మణ్ ప్రజలు తదితరుల పాల్గొన్నారు.