క్రైమ్ న్యూస్

కుక్క తెచ్చిన తంటా.. జుట్లు పట్టుకొని మరీ కొట్టుకున్న కాలనీ మహిళలు.. అసలేమైంది తెలియాలంటే ఈ (వీడియో చూడండి)

సాక్షీ డిజిటల్ న్యూస్ :- ప్రశాంతంగా ఉండే హై ప్రొఫైల్‌ కాలనీలో ఓ కుక్క చిచ్చు పెట్టింది. దీంతో రెండు కుటుంబాలు పొట్టుపొట్టు కొట్టుకున్నాయి. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో జరిగింది. పల్లవ్‌పురం ఫేజ్-2లో ఉన్న హై ప్రొఫైల్ కాలనీలో మే 7న ఒక మహిళ ఆమె కుమార్తె నిషేధిత జాతి కుక్కతో కాలనీలో తిరగడంతో వివాదం చెలరేగింది. దీంతో కాలనీలోని ఓ మహిళ కుక్క యజమానురాలిపై దాడికి దిగింది. ఆ దాడి చినికి చినికి గాలివానలా మారింది. నిందితురాలు తన కొడుకుతో పాటు మరికొంతమందిని పిలిచి ఆ మహిళ మరియు ఆమె భర్తను కొట్టింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు ఎనిమిది మందిపై కేసు నమోదు చేశారు. ఈ సంఘటన మొత్తం సిసిటివి కెమెరాలో రికార్డైంది మరియు వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ అయింది. వీడియోలోని దృశ్యాల ప్రకారం నిందితుడు వేదాంత్ మిశ్రా తన ఎర్రటి కారులో వచ్చి దానిని తన పొరుగువారి ఇంటి ముందు ఆపుతాడు. తెల్లటి కాలర్ నెక్ టీ-షర్ట్ మరియు షార్ట్స్‌లో బయట వేచి ఉన్నట్లు చూడవచ్చు. వెంటనే, మరో ఇద్దరు పురుషులు కూడా స్కూటర్‌లో వస్తారు. ఆ తర్వాత ఆ మహిళ తన ఇంటి నుండి బయటకు వస్తుంది. అంతకుముందు గొడవ జరిగిన మహిళ తులికా మిశ్రా ఆమె వైపు దూసుకెళ్లి దాడి చేయడానికి ప్రయత్నిస్తుంది. అయితే, ఆత్మరక్షణ ప్రయత్నంలో ఉన్న ఆ మహిళ నిందితురాలిని తోసేస్తుంది. దాడికి గురైన మహిళను ఆర్తి కదన్ అని గుర్తించారు. అప్పుడు, వేదాంత్ ఆర్తిపై దాడి చేయడం ప్రారంభిస్తాడు. దారిలో వెళుతున్న వారు జోక్యం చేసుకుని దాడి చేస్తున్న పొరుగువారిని ఆపడానికి ప్రయత్నిస్తారు. అయితే, దాడి చేసిన మహిళలు ఆ మహిళ జుట్టును గట్టిగా పట్టుకుని ఆమెను వదలకపోవడంతో వారి ప్రయత్నాలు ఫలించలేదు. అనంతరం బాధితురాలు ఆర్తి కదన్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిషేధిత జాతి కుక్కను ఇంటి బయట తిప్పుతుండగా అభ్యంతరం చెప్పినందుకు కాలనీకి చెందిన తులిక మిశ్రా అనే మహిళ మరియు ఆమె కుటుంబ సభ్యులు తనను కొట్టారని ఆర్తి కదన్ ఫిర్యాదులో పేర్కొన్నారు. పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన భర్త డాక్టర్ వైభవ్ రాణాపై కూడా ఇనుప రాడ్ తో దాడి చేశారని ఆ మహిళ ఆరోపించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ టీవీ ఫుజేట్‌ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *