సాక్షి డిజిటల్ న్యూస్ :మూడు దశాబ్దాల బ్రేక్ తర్వాత తమ అణ్వాయుధ పరీక్షలను తిరిగి ప్రారంభిస్తున్నామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. అణ్వాయుధాలకు ఉన్న విధ్వంసకర శక్తి కారణంగానే ఆ పరీక్షలు చేయకూడదని గతంలో నిర్ణయించుకున్నామని గుర్తుచేశారు. ఇప్పుడు మారిన పరిస్థితులకు అనుగుణంగా తిరిగి అణు సామర్థ్యాలను పెంచుకుంటున్నామని తెలిపారు.