సాక్షి డిజిటల్ న్యూస్ :కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్పై సింగర్, సామాజిక కార్యకర్త చిన్మయి శ్రీపాద మరోసారి సంచలన ఆరోపణలు చేశారు. మైనర్ బాలికపై లైంగిక వేధింపుల కేసులో.. జానీ మాస్టర్ తనకున్న పలుకుబడిని ఉపయోగించి తప్పించుకువాలని ప్రయత్నిస్తున్నారంటూ.. ఆమె తీవ్ర స్థాయిలో విమర్శించారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ సంచలన పోస్ట్ పెట్టారు. ‘జానీ మాస్టర్ కేసు చాలా క్లిష్టమైనదని, సెక్స్వల్గా హెరాస్ చేయడమే కాకుండా..ఇద్దరి సమ్మతిలో జరిగిన అంశం అంటూ చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని సింగర్ చిన్మయి ఆరోపించారు. " ఓ మైనర్ బాలికను మైజర్ లోబరుచుకున్నప్పుడు అది కచ్చితంగా మేజర్దే తప్ప అవుతుంది. అయినా బాధితురాలు తనకు సహకరించనప్పుడు మైనర్ను బెదిరించి లొంగదీసుకోవడం దారుణం" అని చిన్మయి పేర్కొన్నారు. తాను ఈ విషయంపై మాట్లాడిన ప్రతిసారి జానీ మాస్టర్ భార్య తనకు ఫోన్ చేసి, అలా మాట్లాడవద్దని చెబుతుందన్నారు. తమ నిర్దోషిత్వాన్ని నిరూపించుకునే సాక్ష్యాలు ఉన్నాయని ఆమె అంటున్నారని తెలిపారు. ఇండస్ట్రీలో జానీ మాస్టర్ ఉన్న పలుకుబడి కారణంగా.. ఈ కేసు నుంచి తప్పించుకోవాలని చూస్తున్నారని ఆమె విమర్శించారు. ఈ కేసులో ఒకవేళ కోర్టు తీర్పు వారికి అనుకూలంగా వస్తే.. ఆయనకు అవార్డుల మీద అవార్డులు వస్తాయని, ఇక అతన్ని విమర్శించిన వారే ఆయన గురించి గొప్పగా మాట్లాడతారని ఎద్దేవా చేశారు. "మైనర్ బాలికలతో శృంగారంలో పాల్గొనడం థ్రిల్గా భావించే మహానుభావులకు ఈ అంశం ఉపకరిస్తుంది. మైనర్లను వేధించిన తప్పించుకోవడానికి ఏం చేయాలో వారికి ఖచ్చితంగా తెలుస్తుంది. ఏదేమైనా, ఆ బాధితురాలైన అమ్మాయి విజయం సాధించాలని, తాను ప్రార్థిస్తున్నానన్నారు చిన్మయి. నిందితుడిని శిక్షించి, ఆమెకు న్యాయం జరగాలని ఆశిస్తున్నట్లు తన పోస్ట్ ద్వారా పేర్కొన్నారు.