సాక్షి డిజిటల్ న్యూస్ :నేడు అన్నమయ్య జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా.. చిన్నమండెం మండలం దేవగుడిపల్లెలో ప్రభుత్వ పక్కా గృహాల గృహ ప్రవేశాల కార్యక్రమలో ఆయన పాల్గొననున్నారు. ప్రజావేదికలో పక్కా గృహాల లబ్ధిదారులతో సీఎం చంద్రబాబు మాట్లాడనున్నారు. సీఎం పర్యటనలో భాగంగా.. అధికార యంత్రాంగం భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అనంతరం సోషల్ మీడియా ప్రతిభావంతులతో కూడా సీఎం చంద్రబాబు మాట్లాడనున్నారు. అలాగే సాయంత్రం అక్కడే పార్టీ నేతలు, కార్యకర్తలతో సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో కూటమి ప్రభుత్వం ప్రాధాన్యతలతో పాటు కూటమిలోని అన్ని పార్టీలను కలుపుకుని నియోజకవర్గాల్లో ముందుకు వెళ్లాలని సూచించనున్నారు. ఎమ్మెల్యేలు కార్యకర్తలకు అండగా ఉండాలని కోరనున్నారు. ప్రభుత్వ కార్యక్రమాలను, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఎక్కువ కృషి చేయాలని సీఎం ఆదేశించనున్నారు.