ఎన్నికల లెక్కింపులో ఎన్డీఏ సునామీ—బిహార్‌లో భారీ ఆధిక్యం!

సాక్షి డిజిటల్ న్యూస్: బిహార్‌లో ఎన్డీఏ సునామీ సృష్టిస్తోంది. మూడింట రెండొంతుల సీట్ల దిశగా దూసుకెళుతోంది. ఎన్డీఏ 190, మహాఘట్‌బంధన్‌ 50 సీట్ల ఆధిక్యంలో ఉన్నాయి. ఇతరులు కేవలం 3 స్థానాల్లోనే ఆధిక్యంలో ఉన్నారు. దీంతో వార్‌ వన్ సైడ్ అయిపోయింది. మహాఘట్‌బంధన్‌ చతికిలపడిపోయింది.బిహార్‌ ఎన్నికలు-2020లో ఎన్డీఏ 122 స్థానాలు గెలుచుకుంది. బీజేపీ 74, జనతా దళ్‌ (యునైటెడ్‌) 43, వికాస్‌శీల ఇన్సాన్‌ పార్టీ, హిందుస్థానీ అవామ్‌ మోర్చా తలా 4 స్థానాలు గెలిచాయి. ఈ పార్టీలన్నీ ఎన్డీఏలోవే.మహాఘట్‌బంధన్‌కు 114 సీట్లు దక్కాయి. ఆ ఎన్నికల్లో మహాఘట్‌బంధన్‌లోని రాష్ట్రీయ జనతా దళ్‌ 75 స్థానాలు గెలిచి అతిపెద్ద పార్టీగా నిలిచింది. ప్రస్తుత ఎన్నికల్లో మాత్రం ఎన్డీఏ ఎవరికీ అందనంత స్పీడుతో దూసుకువెళుతోంది. ఎగ్జిట్‌ పోల్స్‌లోనూ ఈ సారి దాదాపు అన్ని సర్వే సంస్థలు ఎన్డీఏనే గెలుస్తుందని చెప్పాయి. అదే దిశగా ఎన్డీఏ నేతలు విజయం సాధిస్తున్నారు. అంచనాలను మించే ఎన్డీఏ దూసుకుపోతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *