ఆఖరి సోమవారం అద్భుతం: భక్తుల్ని ఆశ్చర్యపరిచిన నాగుపాము దర్శనం

సాక్షి డిజిటల్ న్యూస్ :ఆలయాల్లో నాగుపాము దర్శనమిస్తే భక్తులు దైవ మహిమగా భావిస్తుంటారు.. అలాంటిది కార్తీక మాసంలో.. అందులోనూ శివాలయంలో నాగుపాము దర్శనమిస్తే భక్తులు.. స్వయంగా దేవుని మహిమగా పేర్కొంటారు.. అంతేకాకుండా ఆ ఆలయానికి చేరుకుని.. పూజలు చేయడంతోపాటు.. ప్రదక్షిణలు చేస్తారు. అచ్చం అలాంటి ఘటనే ఆంధ్రప్రదేశ్ లో చోటుచేసుకుంది. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా మనుబోలు మండలం చెర్లోపల్లి విశ్వనాథ స్వామి ఆలయంలో ఆదివారం నాగుపాము భక్తులకు దర్శనమిచ్చింది.. ఆలయానికి వచ్చిన భక్తులు నాగుపామును చూసి పూజలు చేశారు. అనంతరం కాసేపటికి తిరిగి పొట్టలోకి వెళ్లిపోయినట్టు భక్తులు, ఆలయ అర్చకులు చెబుతున్నారు..కార్తికమాసం సందర్భంగా విశేష పూజలు నిర్వహిస్తున్నామని, అదే సమయంలో నాగుపాము సాక్షాత్తూ శివుడి దగ్గరకు చేరుకొని పడగ విప్పిందని.. ఆలయ అర్చకుడు శ్రీనివాసులు వివరించారు. ఇది దేవుని మహిమగా వివరించారు.దీనికి సంబంధించిన నెట్టింట వైరల్ అవుతోంది. కాగా.. ఆఖరి సోమవారానికి ముందు నాగు పాము శివయ్య పూజలు చేసిందన్న విషయం తెలుసుకుని.. భక్తులు భారీ సంఖ్యలో అక్కడకు చేరుకుని శివుడికి పూజలు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *