సాక్షి డిజిటల్ న్యూస్ :గాజా స్ట్రిప్పై ఇజ్రాయెల్ మరోసారి దాడి చేసింది. ఈ దాడిలో కనీసం 28 మంది పాలస్తీనియన్లు మరణించినట్లు తెలుస్తోంది. అదే విధంగా గత నెలలో అమలులోకి వచ్చిన యునైటెడ్ స్టేట్స్ మధ్యవర్తిత్వం వహించిన కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. ఇజ్రాయెల్ చేసిన బాంబు దాడుల్లో కనీసం 77 మంది పాలస్తీనియన్లు గాయపడినట్లు గాజాలోని పాలస్తీనా ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.ఇజ్రాయెల్ చేసిన దాడుల్లో గాజాలో 12 మందితో పాటు ఖాన్ యూనిస్ సమీపంలో ఒక కుటుంబంతో సహా కనీసం 10 మంది మరణించారు. దక్షిణ గాజాలోని అల్-మవాసి ప్రాంతంతో సహా మూడు నిర్దిష్ట ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేసినట్లు అధికారులు చెప్పారు. ఈ దాడుతో గాజా స్ట్రిప్ అంతటా భయాందోళనలకు గురైందన్నారు. ఇజ్రాయెల్, హమాస్ మధ్య కాల్పుల విరమణ అక్టోబరు 10న అమలులోకి వచ్చినప్పటికీ.. ఇజ్రాయెల్ బాంబు దాడులు ఆగలేదన్నారు.అయితే ఖాన్ యూనిస్లో తమ సైనికులపై కాల్పులు జరిగాయని, దానికి ప్రతిస్పందనగా గాజా అంతటా హమాస్ లక్ష్యాలపై బుధవారం రాత్రి దాడులు ప్రారంభించినట్లు ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది. ఇజ్రాయెల్ రాష్ట్రానికి ఉన్న ముప్పును తొలగించడానికి బలవంతంగా చర్యలు కొనసాగిస్తుందని సైన్యం పేర్కొంది. ఇదిలా ఉండగా, ఇజ్రాయెల్ దళాలపై కాల్పులు జరిగాయనే వాదనను హమాస్ తిరస్కరించింది.