‘ఆంధ్రా కింగ్ తాలూకా’ మూవీ స్పెషల్—డైరెక్టర్ ప్రకటన

సాక్షి డిజిటల్ న్యూస్ :ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా వస్తున్న ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ ఈ నెల 27న విడుదల కానుంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి మహేశ్ బాబు పి దర్శకత్వం వహిస్తున్నారు. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా, ఉపేంద్ర కీలక పాత్రలో నటిస్తున్నారు. 2002 నేపథ్యంలో జరిగే ఈ కథ ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇస్తుందని దర్శకుడు తెలిపారు. రామ్ కథ విన్న వెంటనే ఒప్పుకున్నారని, పాత్రకు కావాల్సిన ఎనర్జీ ఆయనలోనే ఉందని చెప్పారు. ఇటీవల విడుదలైన ‘చిన్ని గుండెలో’ పాటకు మంచి స్పందన లభిస్తోంది.ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా, మైత్రి మూవీ మేకర్స్ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న తాజా చిత్రం ‘ఆంధ్ర కింగ్‌ తాలూకా’ నవంబర్ 27న థియేటర్లలో విడుదలకు సిద్ధమైంది. దర్శకుడు మహేశ్ బాబు పి తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటించగా కన్నడ స్టార్ ఉపేంద్ర కీలక పాత్రలో కనిపించనుండటం చిత్రానికి మరింత ఆకర్షణగా మారింది. రొమాంటిక్–యాక్షన్ ఎంటర్‌టైనర్ కథ, టైటిల్‌కు ఉన్న అసలు అర్థం, అలాగే కథానాయకుడి ప్రయాణం అన్నీ కలిసి ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇవ్వబోతున్నామని చిత్రం బృందం చెబుతోంది. ఇప్పటికే విడుదలైన సాంగ్స్‌, ట్రైలర్‌కి అద్భుతమైన స్పందన లభించగా రామ్–భాగ్యశ్రీల కెమిస్ట్రీ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.తాజాగా సినిమా విశేషాలను పంచుకున్న దర్శకుడు మహేశ్ బాబు పి మాట్లాడుతూ.. ఈ చిత్రానికి ఆ టైటిల్ ఎందుకు పెట్టామన్నది ప్రేక్షకులు థియేటర్లో చూసినప్పుడు పూర్తిగా అర్థమవుతుందని పేర్కొన్నారు. ‘‘కథ 2002 కాలంలో జరుగుతుంది. ఆ కాలపు భావాలను, ఫ్యాన్ కల్చర్‌ను, హీరోల పట్ల ఉన్న అభిమానాన్ని బలంగా చూపించాలనిపించింది. అందుకే ఈ టైటిల్ ఎంతో సరైనదిగా అనిపించింది’’ అని వివరించారు.ఈ సినిమా ఆవిర్భావానికి కారణమైన ఆసక్తికర సంఘటనను కూడా మహేశ్ బాబు పి గుర్తు చేసుకున్నారు. ‘‘రానా చేసిన ఒక ఇంటర్వ్యూలో ఉపేంద్ర గారు మాట్లాడుతూ.. ‘నిజమైన నన్ను సినిమాల్లోనే చూస్తారు’ అని చెప్పిన మాట నాకు బాగా తగిలింది. ఆ మాటే ఈ కథకు పునాది అయింది. ఒక అభిమాని తన హీరోను ఎలా చూస్తాడు? ఆ ప్రేమలో ఎంత భావోద్వేగం దాగి ఉంటుందో అన్వేషించాలనిపించింది. అలా సూర్య అనే పాత్రను రూపొం‍దించాను. ఆ పాత్రకు ఉపేంద్రగారే పర్ఫెక్ట్ అనిపించింది. ఈ కథను రామ్ గారికి చెబితే ఆయన వెంటనే ఒప్పేసుకున్నారు. పాత్రకు కావాల్సిన ఎనర్జీ, మాస్ వైబ్, ఫ్యాన్ ఎమోషన్ అన్నీ కలిపే శక్తి రామ్‌లో ఉంది. ఫస్ట్ నేరేషన్ తర్వాతే మైత్రి మూవీస్ నుంచి కాల్ రావడం మా టీమ్‌కు పెద్ద నమ్మకాన్ని ఇచ్చింది. ఈ సినిమాకు రామ్ సరైన ఎంపిక’’ అని పేర్కొన్నారు.‘‘హీరోయిన్ పాత్రను ఒక సాధారణ పాత్రలా కాకుండా, కథలో మలుపు తీసుకువచ్చే విధంగా డిజైన్ చేశాం. ప్రేక్షకులు ఆమె పాత్రలో ఓ ప్రత్యేక ప్రయాణాన్ని చూస్తారు. సంగీత దర్శకులు వివేక్–మెర్విన్ అందించిన ఆల్బమ్ ఈ చిత్రానికి మరింత బలం చేకూర్చింది.‘చిన్ని గుండెలో’ నాకు అత్యంత ఇష్టమైన పాట. అలాగే ‘నువ్వుంటే చాలు’ కూడా ఎమోషనల్ లేయర్‌ని అందంగా వ్యక్తపరుస్తుంది. రామ్‌కి మ్యూజిక్‌పై ఉన్న అవగాహన వల్ల పాటలు మరింత బాగా వచ్చాయి. సౌత్ ప్రేక్షకులు హీరోలను కేవలం నటులుగా కాకుండా, జీవితంలో భాగంగా భావిస్తారు. అదే భావం, అదే ప్రేమ ఈ కథలో కనిపిస్తుంది. అందుకే ‘ ఆంధ్రా కింగ్ తాలూకా ’ ఇప్పటివరకు రాని ఒక కొత్త అనుభూతిని అందిస్తుంది’’ అని మహేశ్ బాబు ధైర్యంగా చెప్పారు. నవంబర్ 27న విడుదల కానున్న ఈ చిత్రం, రామ్ కెరీర్‌లో మరో మైలురాయిగా నిలిచే అవకాశముందని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *