Header Banner

ఎన్నికలు లోకల్… కానీ పార్టీలు వేసే వ్యూహాలు మాత్రం స్టేట్ లెవల్

సాక్షి డిజిటల్ న్యూస్ :తెలంగాణలో పంచాయతీ ఎన్నికల నగారా మోగింది. మంగళవారం రాష్ట్ర ఎన్నికల కమిషన్‌.. పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయటంతో.. మరో నెల రోజుల పాటు రాష్ట్రమంతా ఎన్నికల సందడి ఉంటుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 1.66 కోట్ల గ్రామీణ ఓటర్లు ఈ ఎన్నికల్లో పాల్గొని తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 12,728 సర్పంచ్‌ స్థానాలకు, 1,12,242 వార్డులకు.. మొత్తం 3 విడతల్లో ఎన్నికలు నిర్వహిస్తారు. ఈ షెడ్యూల్ ప్రకారం మూడు విడతలుగా ఈ పంచాయితీ ఎన్నికలు ఉంటాయి. డిసెంబర్‌ 11న తొలిదశ, 14 రెండవ దశ, 17న చివరి దశ పోలింగ్ ఉంటుంది. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్‌ నిర్వహించి, అదే రోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటన ఉంటాయి. ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చినట్లయింది. ఎన్నికల షెడ్యూల్ ప్రకటనతో, గ్రామీణ ప్రాంతాల్లో సర్పంచ్, వార్డు సభ్యుల పదవులకు పోటీ పడే అభ్యర్థులు, రాజకీయ పార్టీలు తమ ఎన్నికల వ్యూహాలను సిద్ధం చేసుకోవడంలో నిమగ్నమయ్యాయి. స్థానిక సమస్యలు, అభివృద్ధి కార్యక్రమాలు ఈ ఎన్నికల్లో ప్రధానాంశాలుగా ఉంటాయి.