Header Banner

మైత్రీ మూవీస్ చెబుతున్నది: ఎన్టీఆర్‌-నీల్‌ ఫిల్మ్ కొత్త టైటిల్ రిలీజ్

సాక్షి డిజిటల్ న్యూస్ :జూనియర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబోలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా సినిమా టైటిల్ పై సస్పెన్స్ కొనసాగుతోంది. 'డ్రాగన్' తో పాటు పలు పేర్లను పరిశీలిస్తున్నామని, త్వరలోనే ఒక మంచి ఈవెంట్ తో టైటిల్ ను రివీల్ చేస్తామని నిర్మాత రవిశంకర్ తెలిపారు. డిసెంబర్ మొదటి వారం నుంచి షూటింగ్ పునఃప్రారంభమై, ఏప్రిల్ నాటికి పూర్తవుతుందని, ఇది ఎన్టీఆర్ విశ్వరూపాన్ని చూపించే ఇంటర్నేషనల్ సినిమా అని ఆయన పేర్కొన్నారు.జూనియర్ ఎన్టీఆర్ - డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబోలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా సినిమా కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మైత్రే మూవీ మేకర్స్ బ్యానర్ లో భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతానికి దర్శక హీరోల పేర్లతో 'NTR Neel’ అనే వర్కింగ్ టైటిల్ తో పిలుస్తున్నారు. ఈ చిత్రానిక్ ‘డ్రాగన్‌’ అనే టైటిల్ పెట్టినట్లుగా చాలా రోజులుగా వార్తలు వస్తున్నాయి. స్వయంగా నిర్మాత రవిశంకర్ ఓ సందర్భంలో ఈ సినిమా టైటిల్ బయటపెట్టేశారు కూడా. అయితే ఇప్పుడు ఈ సినిమాకు మరో కొత్త టైటిల్ అనుకున్నట్లుగా తెలుస్తోంది. ఆంధ్ర కింగ్ తాలూకా ప్రమోషన్స్ లో జూనియర్ ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ సినిమా గురించి మైత్రీ రవి శంకర్ మాట్లాడారు. టైటిల్ ఇంకా ఫిక్స్ చేయలేదని చెప్పారు. సినిమా కోసం చాలా పేర్లు పరిశీలనలో ఉన్నాయని, వాటిల్లో ‘డ్రాగన్‌’ ఒకటని ఆయన తెలిపారు. ఫైనల్ గా ఒక టైటిల్ అనుకున్నామని, త్వరలోనే అనౌన్స్ చేస్తామని, ఇప్పటికిప్పుడు ఆ పేరు చెప్పలేమని, టైమ్ వచ్చినప్పుడు ఒక మంచి ఈవెంట్ నిర్వహించి టైటిల్ రివీల్ చేస్తామని, టైటిల్ ఏంటో చెప్పడానికి ఇంకా టైమ్ రాలేదని నిర్మాత చెప్పుకొచ్చారు.మైత్రీ రవి శంకర్ చెప్పిన దాన్ని బట్టి చూస్తుంటే.. తారక్ సినిమాకి డ్రాగన్ కాకుండా వేరే టైటిల్ ఏమైనా పెట్టారేమో అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. మరోవైపు NTR Neel మూవీ షూటింగ్ ఆగిపోయిందంటూ ఈ మధ్య రూమర్స్ చక్కర్లు కొట్టాయి. దీనిపైనా నిర్మాత క్లారిటీ ఇచ్చారు. కొత్త షెడ్యూల్ షూటింగ్ డిసెంబర్ మొదట వారంలో స్టార్ట్ అవుతుందని, ఏకథాటిగా షూటింగ్ చేస్తామని, ఏప్రిల్ నాటికి చిత్రీకరణ పూర్తి చేయాలనేది టార్గెట్ పెట్టుకున్నట్లు తెలిపారు. ఇదొక ఇంటర్నేషనల్ సినిమా అని అన్నారు. ఇది ఎన్టీఆర్ స్టామినాను పూర్తి స్థాయిలో చూపించే సినిమా అవుతుందని, ఆయన నటనలో ఓ కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తుందని పేర్కొన్నారు. ఈసారి ఎన్టీఆర్ విశ్వరూపం చూస్తారని హైప్ ఎక్కిస్తున్నారు.