దేశంలో మొదటి హైడ్రోజన్ ట్రైన్ లాంచ్‌కు కౌంట్‌డౌన్ — మీకు తెలియని 5 ఫ్యాక్ట్స్!

సాక్షి డిజిటల్ న్యూస్ :రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. దేశంలోనే మొట్టమొదటి హైడ్రోజన్ పవర్ ట్రైన్ వచ్చేస్తోంది. భారత రైల్వే హైడ్రోజన్-శక్తితో నడిచే రైలును ఆవిష్కరించింది. ఈ హైడ్రోజన్ రైలు అత్యంత పొడవైనది. అలాగే అత్యంత శక్తివంతమైనది కూడా. పర్యావరణహిత రవాణా దిశగా అడుగులో భాగంగా పరిశోధన, రూపకల్పన, ప్రమాణాల సంస్థ (RDSO) నిర్దేశించిన స్పెసిఫికేషన్లతో హైడ్రోజన్ పవర్ ట్రైన్ రూపొందించారు. భారత రైల్వేలు పైలట్ ప్రాతిపదికన హైడ్రోజన్ రైలు తయారీని పూర్తి చేశాయి. ప్రపంచవ్యాప్తంగా అత్యంత పొడవైన ఈ ‘మేడ్ ఇన్ ఇండియా’ హైడ్రోజన్ ట్రైన్ ఏకంగా 2,400kW శక్తివంతమైన ఉత్పత్తితో 10-కోచ్ డిజైన్‌ను కలిగి ఉంది. జీరో ఉద్గారాలతో పూర్తిగా పర్యావరణహితంగా ఉంటుంది. ఈ ఆవిష్కరణతో పర్యావరణ అనుకూల ప్రయాణానికి గేమ్ ఛేంజర్ అని చెప్పొచ్చు. దేశంలో హైడ్రోజన్ రైలు సెట్ నిర్మాణం ఇప్పటికే పూర్తయిందని కేంద్ర రైల్వే మంత్రి అశ్వని వైష్టవ్ పేర్కొన్నారు. ఈ హైడ్రోజన్ రైలు నిర్మాణాన్ని పూర్తిగా దేశీయంగా రూపొందించి అభివృద్ధి చేశామని రైల్వే మంత్రి
పేర్కొన్నారు. రైలు నిర్వహణకు అవసరమైన హైడ్రోజన్‌ను సరఫరా చేసేందుకు హర్యానాలోని జింద్‌లో విద్యుద్విశ్లేషణ ఆధారిత గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తున్నారు. ఈ రైలులో హైడ్రోజన్ ఇంధన కణాలు ఆక్సిజన్ తో రసాయన చర్య ద్వారా హైడ్రోజన్ వాయువును విద్యుత్తుగా మారుస్తాయి. ఈ విద్యుత్తుతో రైలు నడుస్తుంది. ఇందులో ఉప ఉత్పత్తులుగా వెలువడేవి నీరు, ఆవిరి మాత్రమే. అవసరమైన రసాయన ప్రక్రియల కోసం రైలుకు గంటకు సుమారు 40వేల లీటర్ల నీరు అవసరం అవుతుంది. ఈ రైలు నుంచి పర్యావరణానికి హానికరమైన ఎటువంటి ఉద్గారాలు వెలువడవు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *