అర్ధరాత్రి గన్ ఫైరింగ్ కేసు.. కెనడాలో ముగ్గురు భారతీయులు కస్టడీలో

సాక్షి డిజిటల్ న్యూస్ : కెనడాలో రెండు ప్రత్యర్థి ట్రక్ గ్రూపుల మధ్య జరిగిన కాల్పుల్లో ముగ్గురు భారత సంతతికి చెందిన ట్రక్ డ్రైవర్లను అరెస్టు చేశారు పోలీసులు. మరో వ్యక్తి కోసం గాలిస్తున్నట్టు తెలిపారు. వివరాల్లోకి వెళ్తే.. ఈ సంఘటన అక్టోబర్ 7న రాత్రి 10:45 గంటలకు మెక్‌వీన్ డ్రైవ్, కాజిల్‌మోర్ రోడ్ ప్రాంతంలోని జరిగింది. ఒక్కసారిగా అక్కడికి వచ్చిన రెండు వేర్వేరు గ్రూపులు ఘర్షణకు దిగాయి, ఈ క్రమంలోనే రెండు గ్రూపుల మధ్య కాల్పులు కూడా జరిగాయి. ఈ కాల్పుల్లో ఒక వ్యక్తి గాయపడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను హాస్పిటల్‌కు తరలించారు.ఇక ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు కాల్పులకు పాల్పడిన వారిని గుర్తించేందుకు దర్యాప్తును ముమ్మరం చేశారు. సుదీర్ఘ దర్యాప్తు తర్వాత ఈ కాల్పుల్లో పాల్గొన్న ఓ గ్రూపునకు సంబంధం ఉన్న ముగ్గురు వ్యక్తులను గుర్తించారు. దీంతో నవంబర్ 20న కాలెడాన్‌లోని ఒక ఇంటిపై దాడి చేసి ఆ ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడిన అనుమానితులు ముగ్గురు భారత సంసతికి చెందిన మంజోత్ భట్టి, నవజోత్ భట్టి, అమంజోత్ భట్టిగా పోలీసులు గుర్తించారు, మరో వ్యక్తి పరారీలో ఉన్నాడని.. అతని కోసం గాలిస్తున్నట్టు పోలీసులు పేర్కొన్నారు.ఇక మంజోత్ భట్టి పై తుపాకీతో రెక్‌లెస్‌గా కాల్పులు జరిపాడనే అభియోగాలు మోపగా..నవ్‌జోత్, అమన్‌జోత్ పై వాహనంలో తుపాకీ ఉన్నట్టు తెలిసినా కూడా ప్రయాణించారనే అభియోగాలను మోపారు పోలీసులు. ఇక నాగులో వ్యక్తి పేరు ఇంకా పోలీసులు ప్రస్తావించలేదు. కానీ అతని సంబంధించిన ఒక వీడియోను పోలీసులు రిలీజ్ చేశారు. ఈ వీడియోలో నల్ల జాకెట్, బ్లూ జీన్స్, తెల్ల రన్నింగ్ షూస్ ధరించిన వ్యక్తి కోసం గాలిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.ఈ ఘటన టో ట్రక్ ఇండస్ట్రీలో ప్రత్యర్థతల నేపథ్యంలో జరిగినట్టు పోలీసులు ప్రాథమికంగా నిర్థారించారు. ఈ రెండు గ్రూపులు దక్షిణ ఆసియా సముదాయానికి చెందినవిగా పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *