Header Banner

“వారణాసి తరువాత ఇప్పుడు ఛత్తీస్‌గఢ్‌! అరుదైన పక్షి ప్రత్యక్షం – గ్రామస్తుల హృదయపూర్వక పూజ!”

సాక్షి డిజిటల్ న్యూస్ :అరుదైన తెల్ల గుడ్ల గూబ కనిపిస్తే జీవితంలో ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయని ప్రజల విశ్వాసం. జీవితంలో అనుకున్న పనులు నెరవేరుతాయని, తెల్ల గుడ్లగూబను చూడటం వల్ల సానుకూల ఫలితాలు పొందుతారని అంటారు. దీన్ని చూడటం వల్ల మన పూర్వీకులు మనతో ఉన్నారని, వారి ఆశీర్వాదలు ఎప్పుడూ మనతోనే ఉంటాయని అంటారు. అందుకే, తమ గ్రామానికి వచ్చి తెల్ల గుడ్లగూబను దైవంగా భావించి పూజలు, భజనాలు చేశారు అక్కడి ప్రజలు. ఈ వింత సంఘటన ఛత్తీస్‌గఢ్‌లోని బెమెతారాలోని బెర్లా బ్లాక్‌లోని ఖమారియా గ్రామంలో చోటు చేసుకుంది.స్థానిక ఒక రైతు ఫామ్‌హౌస్‌లో ఒక వింతైన, పూర్తిగా తెల్లటి డేగ గుడ్లగూబ కనిపించింది. ఈ వార్త వేగంగా గ్రామం అంతటా వ్యాపించింది. దీంతో గ్రామస్తులు తెల్ల గుడ్లగూబను పూజించడం ప్రారంభించారు. గత ఆగస్టు నెలలో వారణాసిలోనూ ఇలాంటి తెల్లటి గుడ్లగూబ కనిపించింది. ఆగస్టు 20న సాయంత్రం శయన హారతి తర్వాత ఆలయ శిఖరంపై ఈ తెల్లగుడ్లగూబ కనిపించింది.ఫామ్‌హౌస్‌లో అరుదైన తెల్ల గుడ్లగూబ కనిపించిందనే వార్త గ్రామం అంతటా దావానలంలా వ్యాపించింది. నిమిషాల్లోనే పెద్ద సంఖ్యలో గ్రామస్తులు రైతు ఫామ్‌హౌస్‌కు రావడం ప్రారంభించారు. గ్రామస్తులకు, ఆ పక్షి కేవలం ఒక సాధారణ జీవిగా కాకుండా, దేవుడిగా మారింది. అక్కడికి భారీగా చేరుకున్న ప్రజలు పక్షి ముందు కీర్తనలు పాడటం, పూజలు చేయడం ప్రారంభించారు. చాలామంది పసుపు, కుంకుమ, పువ్వులు అర్పించారు. కొందరు పక్షికి కొబ్బరికాయలు కూడా కొట్టి నైవేధ్యం అర్పించారు. మొత్తం సంఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట హల్‌చల్‌ చేస్తోంది.ఫామ్‌హౌస్‌లో అరుదైన తెల్ల గుడ్లగూబ కనిపించిందనే వార్త గ్రామం అంతటా దావానలంలా వ్యాపించింది. నిమిషాల్లోనే పెద్ద సంఖ్యలో గ్రామస్తులు రైతు ఫామ్‌హౌస్‌కు రావడం ప్రారంభించారు. గ్రామస్తులకు, ఆ పక్షి కేవలం ఒక సాధారణ జీవిగా కాకుండా, దేవుడిగా మారింది. అక్కడికి భారీగా చేరుకున్న ప్రజలు పక్షి ముందు కీర్తనలు పాడటం, పూజలు చేయడం ప్రారంభించారు. చాలామంది పసుపు, కుంకుమ, పువ్వులు అర్పించారు. కొందరు పక్షికి కొబ్బరికాయలు కూడా కొట్టి నైవేధ్యం అర్పించారు. మొత్తం సంఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట హల్‌చల్‌ చేస్తోంది.