భార్యను హత్య చేసిన కేసులో భర్తకు జీవిత ఖైదు, ₹4,000 జరిమానా

కీలక తీర్పును వెలువరించిన Prl. జిల్లా సెషన్స్ జడ్జి శ్రీమతి రత్న పద్మావతి

నేరం చేసిన వారు ఎవరూ శిక్ష నుండి తప్పించుకోలేరు: జిల్లా ఎస్పీ శ్రీ అశోక్ కుమార్ ఐపీఎస్

సాక్షి డిజిటల్ డిసెంబర్ 20 ధర్మపురి నియోజకవర్గ రిపోర్టార్ అజయ్ :

వెల్గటూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బొల్లం రాజేశ్వరి అనే మహిళ కు స్టంభంపల్లి గ్రామానికి చెందిన బొల్లం జగదీష్‌ను 2016 సంవత్సరంలో వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. కాగా, బొల్లం జగదీష్ గత కొంతకాలంగా మద్యం వ్యసనానికి బానిసై ఎటువంటి పని చేయకుండా తిరుగుతూ, కుటుంబ బాధ్యతలను నిర్లక్ష్యం చేయడంతో పాటు భార్యపై అనవసర అనుమానాలు పెంచుకుంటూ మానసికంగా, శారీరకంగా వేధింపులకు గురిచేశాడని విచారణలో తేలింది. ఈ విషయంలో బాధితురాలి కుటుంబ సభ్యులు గతంలో పలుమార్లు జగదీష్‌కు నచ్చచెప్పే ప్రయత్నం చేసినప్పటికీ, అతని ప్రవర్తనలో ఎలాంటి మార్పు రాలేదు.ఈ నేపథ్యంలో తేది: 30-03-2023, తెల్లవారు జామున సుమారు 3:15 గంటల సమయంలో, బొల్లం జగదీష్ తన భార్య రాజేశ్వరిపై పదునైన ఆయుధంతో దాడి చేసి హత్య చేయడం జరిగింది.మృతురాలి అన్న ఫిర్యాదు మేరకు వెల్గటూర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేయగా, ధర్మపురి సర్కిల్ ఇన్స్పెక్టర్లు కోటేశ్వర్ మరియు రమణమూర్తి గార్లు కేసును దర్యాప్తు చేసి నిందితుడు జగదీష్‌ను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు.
ఈరోజు ప్రభుత్వ పబ్లిక్ ప్రాసిక్యూటర్ (పీపీ) మరియు కోర్ట్ డ్యూటీ అధికారులు సాక్షులను ప్రవేశపెట్టగా, సాక్ష్యాధారాలను సమగ్రంగా పరిశీలించిన గౌరవ ప్రిన్సిపల్ జిల్లా సెషన్స్ జడ్జి శ్రీమతి రత్న పద్మావతి గారు, నిందితుడు బాల్లం జగదీష్‌పై నేరం రుజువైనట్లు నిర్ధారించి జీవిత ఖైదు శిక్షతో పాటు ₹4,000/- జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించారు.ఈ కేసులో పీపీగా మల్లికార్జున్, దర్యాప్తు అధికారులుగా ఇన్స్పెక్టర్లు కోటేశ్వర్, రమణమూర్తి, CMS ఎస్‌ఐ శ్రీకాంత్, కానిస్టేబుల్ M. కిరణ్ కుమార్ మరియు కోర్టు కానిస్టేబుల్ శ్రీధర్‌లు గౌరవ కోర్టుకు కీలకమైన సాక్ష్యాధారాలను సమర్పించి నిందితుడికి శిక్ష పడేలా ముఖ్యమైన పాత్ర పోషించారు.
ఈ కేసులో నిందితుడికి శిక్ష పడటంలో కృషి చేసిన పోలీసు అధికారులను జిల్లా ఎస్పీ శ్రీ అశోక్ కుమార్ ఐపీఎస్ అభినందించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *