ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కొండగట్టు పర్యటనకు పటిష్ట భద్రత ఏర్పాట్లు- జిల్లా ఎస్పీ శ్రీ అశోక్ కుమార్ ఐపిఎస్

సాక్షి డిజిటల్ డిసెంబర్ 31 ధర్మపురి నియోజకవర్గ రిపోర్టార్ అజయ్ :

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ కొండగట్టు ప్రసిద్ధి పుణ్యక్షేత్రం పర్యటన సందర్భంగా చేపట్టాల్సిన బాధ్యత ఏర్పాట్లను జిల్లా ఎస్పీ శ్రీ అశోక్ కుమార్ ప్రత్యేకంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఎలిప్యాడ్ ప్రాంతం, వాహనాల పార్కింగ్ స్థలాలు, ట్రాఫిక్ రూట్లు, బందోబస్తు ఏర్పాటు చేయాల్సిన ముఖ్య ప్రదేశాలు తదితర అంశాలను సమగ్రంగా తనిఖీ చేశారు. అనంతరం అక్కడ ఉన్న పోలీస్ అధికారులు, ఇతర శాఖల అధికారులతో సమావేశమై బందోబస్తు పరంగా చేపట్టాల్సిన చర్యలపై పలు కీలక సూచనలు చేశారు. ఉప ముఖ్యమంత్రి పర్యటన సమయంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా వాహనాలు రాకపోకలు సజావుగా నిర్వహించాలని ట్రాఫిక్ నియంత్రానకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించాలని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఆదేశించారు ముఖ్యంగా రద్దీ ప్రాంతంలో అదనపు పోలీస్ బలగాలను మొహరించాలని సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *