Header Banner

పేదరికం కారణంగా 14 సంవత్సరాల వయస్సులో వివాహం.18 ఏళ్లలోపు ఇద్దరు కుమార్తెల తల్లి

సాక్షి డిజిటల్ న్యూస్ జనవరి 24 తెలంగాణ స్టేట్ ఇంచార్జి శ్రీనివాస్ రెడ్డి

భర్త పోలీస్ కానిస్టేబుల్. ఒకరోజు రిపబ్లిక్ డే రోజున తన భర్తతో కలిసి టీమ్ క్లాస్ చూడటానికి వెళ్లింది.భర్త అక్కడ ఒక అధికారికి సెల్యూట్ చేసారు, "అది చూసి ఆమె భర్తను ఏయ్, నువ్వు అతనికి సెల్యూట్ ఎందుకు చేశావ్?" ఆమె అడిగింది.అయ్యో..! ఇతను ఐపీఎస్ అధికారి" అన్నాడు భర్త.ఐపీఎస్ అధికారి కావాలనే తన ఆశయాన్ని ఆ రోజు మనసులో ఉంచుకుని,బయటకు చెప్పకుండా పుస్తకాలు కొనుక్కుని చదివి విడివిడిగా పరీక్షలు రాసి కష్టపడి 10వ, +2, డిగ్రీ పూర్తి చేసింది.ఆ తర్వాత యూపీఎస్సీ పరీక్షల కోసం పగలు రాత్రి చదువుకోని కుటుంబాన్ని పోషించుకోవడం మొదలుపెట్టింది చివరికి ఆమే తన ప్రతిష్టాత్మక కల ఐపిఎస్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి అధికారి అయ్యింది.ఆమె భర్త తొలి వందనం చేశారు. ఈరోజు "సింగం మహిళ" అనే బిరుదుతో ముంబయిలో తిరుగుతున్న వీర తమిళచ్చి డిసిపి అంబిక! ఎన్ని రోజులు నిద్ర లేకుండా పోయినా ఆత్మవిశ్వాసంతో కష్టపడి చదువుకుంది పదవ తరగతి కూడా పూర్తి చేయని ఆమెని ఈరోజు ఐపీఎస్ అధికారిగా మెచ్చుకోవడానికి మాటలు రావడం లేదు.పెళ్లయిన తర్వాత చదువుకోవడం ఎంత సవాలుతో కూడుకున్నదో వివాహితలకు బాగా తెలుసు.అలాంటప్పుడు ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత పదవ తరగతి నుంచి ఐపీఎస్ వరకు చదవడం అనేది ఇతరులు కలలో కూడా ఊహించలేని విషయం.ఆ కలలో అనూహ్యమైన విజయాన్ని సాధించిన చెల్లెలి కోసం ఎన్నో అవార్డులు ఎదురు చూస్తున్నాయి.అభినందనలు తల్లీ … ! నీ విజయం అందరికీ ఆదర్శం .