మహిళా టీచర్ పాడుబుద్ధి… విద్యార్థితో రాసాలీలు చేస్తూ భర్తకు అడ్డంగా దొరికిపోయింది.

సాక్షీ డిజిటల్ న్యూస్ :- కాకినాడ రామారావు పేటకు చెందిన లక్షణ్ రొయ్యలు చెరువులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. రోజు రాత్రి వేళల్లో చెరువుల దగ్గర కాపాలా ఉంటూ ఉదయాన్నే ఇంటికి వస్తున్నాడు. అయితే గతంలో ఒక ప్రైవేట్ కాలేజీలో కంప్యూటర్ ఆపరేటర్ గా చేసిన లక్ష్మణ్ భార్య.. ఆ కాలేజ్ స్టూడెంట్ మణికంఠతో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఇందులో భాగంగానే చాలాసార్లు బయట రహస్యంగా కలిసిన మణికంఠ, ఆ వివాహిత ఈ సోమవారం రాత్రి ఏకంగా ఇంట్లోనే మకాం వేశారు. రోజులాగే చెరువులు దగ్గరికి వెళ్లిన లక్ష్మణ్ భార్య మీద అనుమానంతో అర్ధరాత్రి ఇంటికి వచ్చాడు. కిటికీలోంచి తొంగిచూడగా అప్పటికే వారిద్దరూ ఏకాంతంగా ఉన్నారు. దీంతో ఇంటి డోర్ లు మొత్తం లాక్ చేసి పోలీసులుకు సమాచారం ఇచ్చాడు లక్ష్మణ్. వెంటనే చుట్టుపక్కల వారు కూడా అక్కడికి చేరుకుని ప్రియుడు మణికంఠ, ఆమెను పట్టుకున్నారు. లక్ష్మణ్ యువకుడిపై దాడికి ప్రయత్నించగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇదిలా ఉంటే.. హైదరాబాద్లో నమ్మి వెంట వచ్చిన స్నేహితురాలిని ఇద్దరు యువకులు రేప్ చేశారు. బాచు పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. నిజాంపేట రాజీవ్ గృహకల్ప సముదాయంలోని వారు అద్దెకు ఉంటున్న రూమ్కు ఆ యువతిని తీసుకొచ్చారు. అనంతరం ఆ రూమ్లో ముగ్గురూ కలిసి మద్యం తాగారు. అర్ధరాత్రి సమయంలో అజయ్, హరి కలిసి ఆ యువతిపై అత్యాచారం చేశారు. దీంతో ఆ యువతి ఒక్కసారిగా బెంబోలెత్తిపోయింది. వెంటనే వారి నుంచి తప్పించుకుని రూమ్ బయటకు వచ్చి గట్టిగా కేకలు వేసింది. అనంతరం సమీప స్థానికులు గమనించి అత్యాచారానికి పాల్పడిన యువకులను పట్టుకున్నారు. ఆపై వారికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు నిందుతులను కోర్టులో హాజరుపరిచారు. కోర్టు నిందితులకు రిమాండ్ విధించింది.