తెలంగాణా

ఘోరం.. రైతును చితకబాదిన నలుగురు వ్యక్తులు.. ఎందుకో తెలుసా..!

సాక్షీ డిజిటల్ న్యూస్ :- వనపర్తి జిల్లా గోపాల్పేట్ మండల పరిధిలోని పుల్కే పోలికే పహాడ్ గ్రామంలో ఓ వ్యక్తిని నలుగురు వ్యక్తులు తీవ్ర రక్తస్రావం వచ్చేటట్లు కొట్టిన ఘటన ఆలస్యంగా మంగళవారం వెలుగులోకి వచ్చింది. బాధితుడు గోరింట్ల మల్లయ్య తెలిపిన వివరాల ప్రకారం.. మల్లయ్య తన పొలంలో వరి, మొక్కజొన్న పంట వేసుకొని జీవనం గడుపుతున్నాడు. ఈ తరుణంలో పీరయ్య అనే వ్యక్తి తన గొర్లను వేసుకొని తన పొలం గుండా మేపుకుంటూ వెళ్తున్నాడు. దీంతో బాధితుడు మల్లయ్య గొర్లు తన చేనులో మేపకుండా కొంచెం దూరంగా మేపండి అని చెప్పాడు. దీంతో “నేనే ఇక్కడే మెపుతా రా నీ దిక్కు ఉన్నచోట చెప్పుకోమని” పీరయ్య తన చేతిలో ఉన్న గొడ్డలి కాడతో బాధితుడు మల్లయ్య తలపై బలంగా కొట్టడంతో తీవ్ర రక్తస్రావం జరిగింది. అక్కడే ఉన్న పీరయ్య కొడుకులు రవి కాసింలు మొత్తం నలుగురు కలిసి బాధితుడు మల్లయ్యను గొడ్డును బాదినట్లు బాదారు. తన దగ్గర ఉన్న సెల్ ఫోన్ లాక్కుని కాళ్ళ మీద పడిన కూడా వదిలేయకుండా మానవ మృగం లాగా ప్రవర్తించి చితకబాదారు. మల్లయ్య పడిపోవడంతో చనిపోయాడని వదిలేసి వెళ్లిపోయారని బాధితుడు మల్లయ్య తెలిపాడు. అదేవిధంగా మూడు రోజులు అయినా కూడా స్థానిక ఎస్సై నరేష్ కుమార్ దీనిపై ఎలాంటి విచారణ చేయకపోవడంతో వనపర్తి ఎస్పీ ని కలిసి నాకు న్యాయం జరిగే వరకు పోరాడుతానని బాధితుడు మల్లయ్య వాపోయాడు. ఈ విషయంపై దిశ ఎస్ఐ ని వివరణ కోరగా పోలికే పహాడ్ గ్రామానికి చెందిన మల్లయ్యను కొందరు వ్యక్తులు కలిసి కొట్టారు. కేసు అయిందా లేదా అని గోపాల్పేట ఎస్సై ని అడగగా కేసు అయింది, ఎఫ్ ఐ ఆర్ కూడా ఇచ్చామని తెలియజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *