ఒకప్పుడు నీళ్లు తాగి బ్రతికిన ఆమె, ఇప్పుడు ఇండస్ట్రీలో టాప్ స్టార్!

సాక్షి డిజిటల్ న్యూస్ :ప్రస్తుతం ఇండస్ట్రీలో ఆమె సెన్సెషన్. బుల్లితెరపై పలు సీరియల్స్ ద్వారా కెరీర్ స్టార్ట్ చేసిన ఆమె ఇప్పుడు వెండితెరపై తనకంటూ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. 2002లో కిట్టీ పార్టీ అనే టెలివిజన్ ధారావాహికలో ఒక చిన్న పాత్రతో అరంగేట్రం చేసింది. ఆ తర్వాత పలు సహాయక పాత్రలలో కనిపించింది.చివరకు నిర్మాత ఏక్తా కపూర్ తెరకెక్కించిన ఓ సినిమాలో ప్రధాన పాత్రలో నటించింది. తక్కువ సమయంలోనే హిందీలో పలు స్టార్స్ సరసన నటించే ఛాన్స్ కొట్టేసింది. కార్తీక్ ఆర్యన్ సరసన ‘ప్యార్ కా పంచనామా’ చిత్రంలో నటించి ప్రశంసలు అందుకుంది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించింది.ఆ తర్వాత ఆమె నటించిన చిత్రాలన్నీ రూ.100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఆమె నటించిన డ్రీమ్ గర్ల్ మూవీ రూ.200 కోట్లు వసూలు చేసి 2019 లో అత్యధిక వసూళ్లు సాధించిన హిందీ చిత్రాలలో ఒకటిగా నిలిచింది. ఆమె మరెవరో కాదు.. బీటౌన్ బ్యూటీ నుష్రత్ భరుచా.ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన కుటుంబంలో తానే ఏకైక సంపాదకురాలిని అని, తన కళాశాల రోజుల్లో ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నట్లు తెలిపింది. రోజుకు కేవలం 8 రూపాయలు ఖర్చు చేసి, నీళ్లు తాగుతూ బతికానని చెప్పుకొచ్చింది. “కెరీర్ తొలినాళ్లల్లో ఒక నెలలో ఎంత ఖర్చూ చేయాలో అని ముందే నిర్ణయించుకున్నాను. నా ముఖ్యమైన అవసరాల తర్వాత మరోసారి కొనుగోలు చేయడం లేదా పొదుపు చేయడం చేశాను అని చెప్పుకొచ్చింది.నా తండ్రి వ్యాపారంలో మోసపోయిన తర్వాత నా ప్రపంచాన్ని మార్చుకున్నాను. ఆ సమయంలో ఎన్నో ఆర్థిక ఇబ్బందులు చూశాము. డబ్బు ఖర్చు చేయడంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నాను. కాలేజీ రోజుల్లో 5 సంవత్సరాలలో కేవలం 100 మాత్రమే ఖర్చు చేశాను. రోజుకు రూ.8 ప్రయాణం కోసమే ఖర్చు చేశాను. కాలేజీలో ఉచిత నీళ్లు.. నాకు ఆకలిగా ఉన్నప్పుడు నీళ్లే తాగేదాన్ని” అంటూ చెప్పుకొచ్చింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *