రాష్ట్ర జిల్లా స్థాయి కబడ్డీ పోటీల్లో ఎంపికైన క్రీడాకారులను సన్మానించిన మాజీ మంత్రి కొప్పుల

సాక్షి డిజిటల్ డిసెంబర్ 31 ధర్మపురి నియోజకవర్గ రిపోర్టార్ అజయ్ :

ధర్మపురి మండలం రామయ్యపల్లి గ్రామ సర్పంచ్ కనుకుట్ల రవింధర్ రెడ్డి నిర్వహిస్తున్న క్రికెట్ టోర్నమెంట్‌కు ముఖ్య అతిథిగా హాజరై క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలిపిన మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ అనంతరం అదే గ్రామానికి చెందిన కసారపు వేంకటేశ్, అట్టెం మనోజ్, రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీల్లో అలాగే, పరమల వినయ్, యాదగిరి తిరుపతి జిల్లా స్థాయి కబడ్డీ పోటీల్లో ఎంపిక కాగా వారిని శాలువా కప్పి కొప్పుల ఈశ్వర్ సత్కరించారు మాజీ మంత్రి వెంట బిఆర్ఎస్ పార్టీ సర్పంచ్ కనుకుట్ల రవింధర్ రెడ్డి, ఆవునూరి శ్రీకాంత్, బండారి రంజిత్, కాళ్ళ జగన్, మరియు బిఆర్ఎస్ పార్టీ నాయకులు ఉన్నారు

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *